మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. 15 మంది గాయపడగా… వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా చెలరేగినట్లు తెలిసింది.
ప్రాథమిక సమచాారం మేరకు… ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. పలకల క్వారీల బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్లు తెలిసింది. బస్సు వెనుక భాగంలో ఉన్నవారే ఎక్కువగా చనిపోయారు. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
సమచాారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
{{/usCountry}}సమచాారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
{{/usCountry}}బస్సు నుండి మరిన్ని మృతదేహాలను వెలికితీయాల్సి ఉందని డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. మలుపు తిరుగుతున్న సమయంలో టిప్పర్… ఈ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిందని తెలిపారు. ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు.
సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి :
రాయవరం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి.. ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య చికిత్సను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.