అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసులోని నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. కురబాలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ముదివేడు పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి దొరకలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృత దేహం కనిపించింది.
చిన్నారిపై నిందితుడు లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసినట్లు తెలుస్తోంది. బాలిక ఇంటి పక్కనే ఉండే కులవర్ధన్ మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు. పోస్టుమార్టం జరిగిన తర్వాత బాలిక మరణానికి కారణాలు చెబుతామని పోలీసులు చెప్పారు.
ఇదిలా ఉండగానే ఇవాళ నిందితుడు కులవర్ధన్ శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
హోంమంత్రి పరామర్శ
మదనపల్లె ఘటనలో చిన్నారి తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఫోన్లో బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. మదనపల్లె ఘటనపై జిల్లా ఎస్పీతోనూ మాట్లాడారు.
{{/usCountry}}మదనపల్లె ఘటనలో చిన్నారి తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఫోన్లో బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. మదనపల్లె ఘటనపై జిల్లా ఎస్పీతోనూ మాట్లాడారు.
{{/usCountry}}