ఎయిమ్స్ మంగళగిరిలో నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే
ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయింది. ఇందులో భాగంగా 8 నాన్ ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. నవంబర్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ముఖ్యమైన వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - ఎయిమ్స్, మంగళగిరి
- ఉద్యోగ ఖాళీలు - 08
- ఖాళీల వివరాలు - సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్) -1, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ - 1,లా ఆఫీసర్ -1, బయో-మెడికల్ ఇంజినీర్ - 1, శానిటరీ ఇన్స్పెక్టర్ -1, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ -1, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ -1 పెర్ఫ్యూజినిస్ట్ -1
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. లా ఆఫీసర్ పోస్టుకు ఎల్ఎల్ బీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు - కొన్ని పోస్టులకు రూ. 1500 ఉండగా… మిగతా పోస్టులకు రూ. 1000గా నిర్ణయించారు.
- దరఖాస్తులకు చివరి తేదీ -30 నవంబర్ 2025
- ఎంపిక విధానం - షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- అప్లికేషన్ లింక్ - https://forms.gle/Ff8FmaAQG4A8GnBC
- పూర్తి చేసిన హార్డ్ కాపీని రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెం 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ, అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522503" చిరునామాకు పంపాలి.
- హార్డ్ కాపీని డిసెంబర్ 10వ తేదీలోపు పంపొచ్చు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.aiimsmangalagiri.edu.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

