...
...
Next Story

డీఎస్సీ నియామక ప్రక్రియ వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే : చంద్రబాబు

డీఎస్సీ నియామకాల్లో డీవియేషన్ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నియామక ప్రక్రియ వివరాలన్నీ ఆన్ లైన్‌లోనే అని వెల్లడించారు.

Published on: Aug 17, 2026, 18:02:59 IST
Advertisement

మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా డీవియేషన్ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్ లైన్‌లోనే ఉంచామన్నారు. వైసీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

'మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్ధులు తయారవుతారని మేం విశ్వసించాం. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నాం. ఐటీని ప్రోత్సహించటం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశాం. విద్య రంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించింది. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మొదట ఎన్టీఆరే. నేను సీఎం అయిన తొలినాళ్లలోనే ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నాం. ప్రతీ కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతీ మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజిని ఏర్పాటు చేశాం.' అని చంద్రబాబు అన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు చేయని 2019-24 మధ్య ఉన్న పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారన్నారు. ఇప్పటి వరకూ 14 డీఎస్సీలు జరిగితే, టీడీపీ, ఎన్డీయే హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇంత వరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. పాఠశాలలకు విద్యార్థుల హాజరు పెంచాలనే లక్ష్యంతో గతంలో డ్రై రేషన్ కూడా అందించామన్నారు.

'పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశాం. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశాం. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్ లైన్‌లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది.? ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్‌లో నియామక ప్రక్రియలో ఒక్క డీవియేషన్ కూడా లేదు.' అని చంద్రబాబు అన్నారు.

తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ, కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నానన్నారు. పూర్తి పారదర్శకతతో బాధ్యతతో, పూర్తి జవాబు దారీతనంతో నియామకాలు జరిగాయని మరోసారి స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తులు శాసనసభకు వచ్చి డిమాండ్ చేయాలని, రెండున్నర ఏళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారని చంద్రబాబు అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe