దేశమంతటా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పటికీ, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం ఈ ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బసంపల్లి మండలం శెట్టూరు గ్రామ ప్రజలు వినాయక చవితి వేడుకలను నిర్వహించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

శెట్టూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన మారెమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయి. గణేష్ చతుర్థి సోమవారం. సాధారణంగా ఈ గ్రామ దేవత జాతర వినాయక చవితి పండుగకు ఒకటి లేదా రెండు రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఈ సంవత్సరం మారెమ్మ ఉత్సవాలు.. గణేష్ చతుర్థి తర్వాతి రోజున ఉన్నాయి.
గ్రామ ఆచారం ప్రకారం మారెమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గ్రామస్థులు, భక్తులు సాంప్రదాయబద్ధంగా మాంసాహార నైవేద్యాలను సమర్పిస్తారు. ఒకవైపు మారెమ్మ జాతరలో మాంసాహార వంటకాలు సిద్ధం చేస్తుండగా, మరొకవైపు అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించే వినాయక చతుర్థి పూజలు చేయడం సమంజసం కాదని ఊరి పెద్దలు, గ్రామస్థులు భావించారు.
గ్రామ దేవత జాతర జరుగుతుండగా.. వినాయక మండపాలు ఏర్పాటు చేసి పూజలు జరపడం శాస్త్రోక్తంగా సరికాదని స్థానికులు విశ్వసించారు. అందువల్ల గణేష్ ఉత్సవాల నుండి దూరంగా ఉండి, గ్రామమంతా కలిసికట్టుగా మారెమ్మ అమ్మవారి సేవలోనే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలకు దూరంగానే ఉంటున్నారు. మారెమ్మ ఉత్సవాల సందర్భంగా ఇంట్లో బంధువులు ఉంటారు. నాన్ వెజ్ వంటకాలు ఉంటాయి.
రెండు పండుగల ఆధ్యాత్మిక నియమాలకు భంగం వాటిల్లకుండా, గ్రామ సంప్రదాయాలను గౌరవిస్తూ స్థానికులు తీసుకున్న ఈ నిర్ణయం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా ఉంది. భక్తితో పాటు గ్రామ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలంతా ఐక్యంగా ఉంటున్నారు. దాదాపు ప్రతీ ఇంట్లో మాంసాహారం వండుతారు కాబట్టి.. వినాయకుడు అపవిత్రం కాకూడదనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా గణేష్ చతుర్థిని నిర్వహించడం లేదు.
{{/usCountry}}రెండు పండుగల ఆధ్యాత్మిక నియమాలకు భంగం వాటిల్లకుండా, గ్రామ సంప్రదాయాలను గౌరవిస్తూ స్థానికులు తీసుకున్న ఈ నిర్ణయం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా ఉంది. భక్తితో పాటు గ్రామ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలంతా ఐక్యంగా ఉంటున్నారు. దాదాపు ప్రతీ ఇంట్లో మాంసాహారం వండుతారు కాబట్టి.. వినాయకుడు అపవిత్రం కాకూడదనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా గణేష్ చతుర్థిని నిర్వహించడం లేదు.
{{/usCountry}}