ఉగ్ర సంస్థలతో లింకులు...! మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సత్యసాయి జిల్లా పోలీసులు
జైషే మహ్మద్ ఉగ్రవాద నెట్ వర్క్ తో సంబంధాలు ఉన్న మరో ఇద్దరిని శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో నమోదైన కేసులో విచారిస్తున్న పోలీసులు… తాజాగా వీరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ధర్మవరంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి కేసులో దర్యాప్తు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నిందితులను ఉత్తర ప్రదేశ్ కు చెందిన సజ్జాద్ హుస్సేన్, మహారాష్ట్రలోని మాలేగావ్ కు చెందిన తౌఫీక్ ఆలం షేక్ లను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు.

"నూర్ మహ్మద్ అరెస్టు తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. మా బృందాలు ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా, మహారాష్ట్రలోని మాలేగావ్ లో విచారణ కొనసాగించాయి. పాకిస్తాన్ ఆధారిత జిహాదీ వాట్సాప్ గ్రూప్ లతో పాటు జైషే మహ్మద్ తో సంబంధం ఉన్న ఛానెల్స్ లో చురుకుగా ఉన్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశాయి" జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వివరించారు.
పాకిస్థాన్ ఐఎస్ఐ ఆధారిత జైష్-ఎ-మహమ్మద్తో సంబంధం ఉన్న వాట్సాప్ గ్రూపులతో ప్రమేయం ఉందన్న ఆరోపణపై శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నూర్ మహ్మద్ను గతంలో ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇతని నుంచి సేకరిస్తున్న సమాచారం ఆధారంగా కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా అరెస్ట్ కాబడ్డిన నిందితులిద్దరి నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, జిహాదీ ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని హుస్సేన్ నివాసం నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులిద్దరినీ ఆయా రాష్ట్రాల్లోని కోర్టుల్లో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం ట్రాన్సిట్ వారెంట్లపై ధర్మవరానికి తీసుకువచ్చామని వివరించారు.
“హుస్సేన్ పాకిస్థాన్లో ఉన్న టెర్రరిస్ట్ సంస్థలతో పాటు వీడియో కాల్లో మాట్లాడినట్టు ఆధారాలు దొరికాయి. ఇక్కడి యువతను ట్రాప్ చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఐఎస్ఐ ఆధారిత ప్రేరేపిత సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి యువత చాలా జాగ్రత్తగా ఉండాలి” అని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

