...
...
Next Story

AU 100 Years Event : ఘనంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

Andhra University Centenary Celebrations : విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ (ఏయూ) 100 ఏళ్ల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత ఉపరాష్ట్రపతితో పాటు సీఎం చంద్రబాబు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొన్నారు.

Published on: Apr 27, 2026 05:39 PM IST
Advertisement

Andhra University Centenary Celebrations : విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ నగరం వేదికగా జరిగిన ఈ ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా దిగ్గజాలు తరలివచ్చారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
ఆంధ్రా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కె. హరిబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలకు మరింత శోభను చేకూర్చారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభం….

ఈ శతాబ్ది ఉత్సవాలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అనంతరం జాతీయ గీతం మరియు వందేమాతర గీతాలతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను, విద్యారంగంలో అది పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనకు శతాబ్ది స్మారక చిహ్నాన్ని (బహూకరించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి గౌరవించారు.

విశాఖలో విద్యార్థుల కేరింతలు, ప్రముఖుల సందడితో ఆంధ్రా విశ్వవిద్యాలయ ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. రాబోయే తరాలకు కూడా ఈ విశ్వవిద్యాలయం జ్ఞాన వెలుగులు పంచాలని వక్తలు ఆకాంక్షించారు.

ఆంధ్రా యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ మాత్రమే కాదని… ఇది ఒక ఎమోషన్ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. “2014లో రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి రెండు బ్రాండ్లు వచ్చాయి. ఒకటి ఆంధ్రా యూనివర్సిటీ.. మరొకటి సీబీఎన్. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తొలి కేబినెట్ భేటీ ఏయూలోనే నిర్వహించాం.పక్కనే విశాఖ బీచ్ రోడ్డు, ఏయూ విద్యార్థుల జోష్, అద్భుతమైన ఫ్యాకల్టీ.. ఇవన్నీ చూస్తుంటే ఏయూలో చదవనందుకు ఎంతో బాధపడుతున్నా” అంటూ కామెంట్స్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe