సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది.పలు ముఖ్యమైన అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి ఆమోదముద్ర పడింది.
ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు చనిపోవడంపై ఏపీ మంత్రి మండలి సంతాపం తెలిపింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి మృతికి సంతాపం తెలుపుతూ క్యాబినెట్ భేటీలో తీర్మానం చేశారు.
ఏపీ కేబినెట్ భేటీ - ముఖ్యమైన విషయాలు
అమరావతి పరిధిలోని వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల ఇచ్చే నిర్ణయానికి ఆమోదం.
పిడుగురాళ్ల వైద్యకళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర.
అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్.
పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు ఆమోదం.
అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైప్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు ఆమోదం.