...
...
Next Story

AP EAPCET 2026 Counselling : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం - ముఖ్య తేదీలు

AP EAPCET 2026 Counselling : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షురూ కానుంది. ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు జులై 29 వరకు ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 6వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

Published on: Jul 20, 2026 05:12 AM IST
Advertisement

AP EAPCET 2026 Counselling : ఆంధ్రప్రదేశ్ ఎప్‌సెట్ -2026 కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కౌన్సెలింగ్ ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు జులై 29 వరకు ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ కోసం విద్యాశాఖ మొత్తం పది రోజుల పాటు గడువు ఇచ్చింది.

  • విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) ప్రక్రియ జులై 22 నుంచి ప్రారంభవుతుంది. జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది.
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు జులై 25 నుంచి జులై 31వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
  • ఒకవేళ తాము ఎంచుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, అందుకు ఆగస్టు 1వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుంది.

ఆగస్టు 6న సీట్ల కేటాయింపు..

ఏపీ ఈఏపీసెట్ -2026 కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్ -2026 కౌన్సెలింగ్

వెబ్ ఆప్షన్ల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13వ తేదీ లోపు కేటాయించిన కాలేజీల్లో స్వయంగా హాజరై సెల్ఫ్ జాయినింగ్, రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి.

సీటు పొందే విద్యార్థులు తప్పనిసరిగా రిపోర్టింగ్ చేయాలి. అలా చేయకపోతేసీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షల ఫలితాలను చూస్తే…. ఇంజనీరింగ్‌లో 1,82,317 మంది అర్హత సాధించారు(70.52 శాతం). అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు.ఇంజినీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణత శాతంతో అమ్మాయిలు ముందంజలో నిలిచారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe