రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎప్సెట్ (AP EAPCET-2026) ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. మొదట ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీనే (జూన్ 1) ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ…. సాంకేతిక కారణాల దృష్ట్యా ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారు.
ఫలితాలు ఆలస్యం… కారణాలు

ఏపీ ఎప్సెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. ఒకవేళ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కంటే ముందే ఎప్సెట్ ర్యాంకులను ప్రకటిస్తే, ఆ తర్వాత మార్కులు పెరిగే విద్యార్థుల ర్యాంకుల్లో మార్పులు వచ్చి తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. ఈ గందరగోళానికి తావులేకుండా…. అత్యంత పారదర్శకంగా ర్యాంకులు కేటాయించాలన్న ఉద్దేశంతోనే సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాకే ఎప్సెట్ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. అందులోనూ ఒక్క గణితం (మ్యాథ్స్) సబ్జెక్టు పరీక్ష రాస్తున్న వారే దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు.ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. ఆ దిశగా ఇంటర్ బోర్డు కూడా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
ఈనెల మూడో వారంలో ఫలితాలు…!
ఇంటర్ బోర్డు ఫలితాలు వెలువడిన వెంటనే…. వాటిని ఎప్సెట్ మార్కులకు అనుసంధానం చేసి జూన్ 16-18 మధ్య ఈఏపీసెట్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితాల విడుదల తేదీపై అధికారికంగా తేదీని ప్రకటిస్తారు.
గత నెల (మే) 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ ఎప్సెట్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలన్నింటికీ కలిపి దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. జేఎన్టీయూ కాకినాడ ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
{{/usCountry}}గత నెల (మే) 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ ఎప్సెట్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలన్నింటికీ కలిపి దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. జేఎన్టీయూ కాకినాడ ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
{{/usCountry}}ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి అయింది. కేవలం తుది ఫలితాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది.అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా రిజల్ట్స్ చెక్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే కంబైన్డ్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాల అనంతరం ఉన్నత విద్యా మండలి విడతల వారీగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించి ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే కాలేజీల వారీగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.