ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం..! ఫీజు చాలా తక్కువ, ఇవిగో వివరాలు

వారసత్వ భూముల విషయంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూములకు ధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. స్థానికంగా ఉండే గ్రామ సచివాలయాల్లోనే వీటిని పొందే అవకాశాన్ని తీసుకువస్తోంది.

Published on: Jul 6, 2025, 14:37:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ రెవెన్యూ వ్యవస్థలో మరో మార్పు రానుంది. వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేసింది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు దారితీస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం…. అతి ఫీజుతోనే వారసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని నిర్ణయించింది.

ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం
ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం

ఇటీవలే సీఎం చంద్రబాబు రెవెన్యూశాఖపై సమీక్షించారు. ఇందులో పలు అంశాలపై చర్చించగా.. వారసత్వ భూములకు సెక్షన్‌ (సక్సెషన్) సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే వారసత్వ భూములకు ఇచ్చే సెక్షన్ సర్టిఫికెట్ ధరలు కూడా తక్కువగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

వారసత్వ భూములకు సర్టిఫికెట్‌ - ముఖ్య వివరాలు

  • వారసత్వ ధ్రువీకరణ పత్రం (సక్సెషన్ సర్టిఫికెట్) లేకపోవడం వల్ల గ్రామాల్లో పలు వివాదాలకు దారితీస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే ధ్రువీకరణ పత్రం జారీని సులభతరం చేయాలని నిర్ణయించింది.
  • రూ.10 లక్షల విలువ లోపు భూములకు కేవలం రూ.100 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షలకు పైబడిన భూములకు రూ.1000 కట్టాలి.
  • ఇందుకు సంబంధించే సర్టిఫికెట్లను స్థానిక గ్రామ సచివాలయాల్లోనే అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
  • ఇక రాష్ట్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 1.85 లక్షల దరఖాస్తులురాగా…. వాటిలో ఇప్పటికి కేవలం 687 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
  • గత ఏడాది కాలంలో ప్రభుత్వానికి అందిన 4.63 లక్షల గ్రీవెన్సుల్లో ఇప్పటి వరకూ 3.99 లక్షల గ్రీవెన్సులను పరిష్కరించడం జరిగినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని వివరించారు.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More