సర్వీస్ ఇనాం భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై లోతైన అధ్యయనం కోసం దేవస్థానం అధికారులు, తహశీల్దార్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశామని, 45 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారాన్ని ఖరారు చేసే ముందు ముఖ్యమంత్రి నివేదికను పరిశీలిస్తారు. ఆయన సూచనn మేరకు సర్వీస్ ఇనాం భూములకు శాశ్వత పరిష్కారం చూపనుంది ప్రభుత్వం.

రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ గృహనిర్మాణ పథకం అందరికి ఇల్లు గురించి కూడా చర్చించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తూ ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ చేపట్టిన పర్యటనలను మంత్రి అనగాని హైలైట్ చేశారు. పరిశ్రమలు, ఇతర అవసరాలకు బలమైన భూ కేటాయింపు విధానం అవసరాన్ని నొక్కి చెప్పారు.
చర్చలలో ప్రీ-హోల్డ్ భూమి సమస్యలను క్రమబద్ధీకరించడం, వక్ఫ్ భూముల సమగ్ర సమీక్ష ఉన్నాయి. 2014-19 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసి, ఐదు లక్షల యూనిట్లకు పరిపాలనా అనుమతి జారీ చేసిందని, అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించిన 2.6 లక్షల యూనిట్లను కూడా పూర్తి చేయలేదని మంత్రి పి.నారాయణ తెలిపారు. వాటిని పూర్తి చేయడంలో విఫలమైందని టిడ్కో గృహనిర్మాణ పథకాల గురించి వివరించారు.
పేదలకు న్యాయం జరిగేలా చూసేందుకు వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని నారాయణ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన చర్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ ఇళ్ళు, ప్లాట్లు అందించాలనే ముఖ్యమంత్రి దార్శనికత గురించి మంత్రి కె.పార్థసారధి మాట్లాడారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం వంటి చట్టపరమైన అడ్డంకులను ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పార్థసారధి చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఉన్న చట్టపరమైన అడ్డంకులను గమనించి, అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరుతున్నట్లు వెల్లడించారు. ఆ రిపోర్ట్ అందిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చలు జరిపి తదుపరి నిర్ణయాలు తీసుకుంటాన్నారు.
{{/usCountry}}జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం వంటి చట్టపరమైన అడ్డంకులను ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పార్థసారధి చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఉన్న చట్టపరమైన అడ్డంకులను గమనించి, అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరుతున్నట్లు వెల్లడించారు. ఆ రిపోర్ట్ అందిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చలు జరిపి తదుపరి నిర్ణయాలు తీసుకుంటాన్నారు.
{{/usCountry}}