ఆ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు, 45 రోజుల్లో నివేదిక!

 సర్వీస్ ఇనాం భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర విధానాన్ని అవలంబించనుంది. ఈ మేరకు వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

Published on: Oct 25, 2025, 10:44:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సర్వీస్ ఇనాం భూములపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూములపై లోతైన అధ్యయనం కోసం దేవస్థానం అధికారులు, తహశీల్దార్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశామని, 45 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారాన్ని ఖరారు చేసే ముందు ముఖ్యమంత్రి నివేదికను పరిశీలిస్తారు. ఆయన సూచనn మేరకు సర్వీస్ ఇనాం భూములకు శాశ్వత పరిష్కారం చూపనుంది ప్రభుత్వం.

ఇనాం భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇనాం భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై సచివాలయంలో మంత్రుల బృందం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ గృహనిర్మాణ పథకం అందరికి ఇల్లు గురించి కూడా చర్చించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తూ ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ చేపట్టిన పర్యటనలను మంత్రి అనగాని హైలైట్ చేశారు. పరిశ్రమలు, ఇతర అవసరాలకు బలమైన భూ కేటాయింపు విధానం అవసరాన్ని నొక్కి చెప్పారు.

చర్చలలో ప్రీ-హోల్డ్ భూమి సమస్యలను క్రమబద్ధీకరించడం, వక్ఫ్ భూముల సమగ్ర సమీక్ష ఉన్నాయి. 2014-19 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసి, ఐదు లక్షల యూనిట్లకు పరిపాలనా అనుమతి జారీ చేసిందని, అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన 2.6 లక్షల యూనిట్లను కూడా పూర్తి చేయలేదని మంత్రి పి.నారాయణ తెలిపారు. వాటిని పూర్తి చేయడంలో విఫలమైందని టిడ్కో గృహనిర్మాణ పథకాల గురించి వివరించారు.

పేదలకు న్యాయం జరిగేలా చూసేందుకు వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని నారాయణ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన చర్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ ఇళ్ళు, ప్లాట్లు అందించాలనే ముఖ్యమంత్రి దార్శనికత గురించి మంత్రి కె.పార్థసారధి మాట్లాడారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం వంటి చట్టపరమైన అడ్డంకులను ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పార్థసారధి చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఉన్న చట్టపరమైన అడ్డంకులను గమనించి, అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరుతున్నట్లు వెల్లడించారు. ఆ రిపోర్ట్ అందిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చలు జరిపి తదుపరి నిర్ణయాలు తీసుకుంటాన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More