AP RTE Admissions : ఏపీ ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు - ప్రత్యేక కమిటీ ఏర్పాటు, కొత్త నిబంధనలపై కసరత్తు
AP Private Schools Free Admissions : ఏపీలోని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల మార్గదర్శకాలను సవరించేందుకు 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని విద్యాశాఖ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కొత్త నిబంధనలు రానున్నాయి.
AP Private Schools Free Admissions : ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విద్యా హక్కు చట్టం (RTE) 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు అమలవుతున్న ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణల రూపకల్పన, పకడ్బందీ అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది జనవరి 13వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఈ ఉచిత ప్రవేశాల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఉచిత సీట్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా, అసలైన అర్హులైన నిరుపేద విద్యార్థులకే ఈ ప్రయోజనం అందేలా పాత నిబంధనలను సవరించి కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నారు.
16 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ
నూతన మార్గదర్శకాల సవరణ బాధ్యతలను వేగవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఛైర్పర్సన్గా మొత్తం 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీమ్ అన్సారియా ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు.
- ఈ రాష్ట్ర స్థాయి కమిటీ విద్యా హక్కు చట్టం అమలు తీరును, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల విధానాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది.
- అర్హతల నిబంధనలు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, సీట్ల కేటాయింపు మరియు పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించే ఫీజుల పునరుద్ధరణ వంటి అంశాలపై స్పష్టమైన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
- కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్త ఉచిత ప్రవేశాల గైడ్లైన్స్ను త్వరలోనే అమలు చేయనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

