ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు దళం(Andhra Pradesh Special Police)లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు విడతల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటిల్లో 19 ఎస్సై పోస్టులుండగా…. 245 కానిస్టేబుల్ ఖాళీలున్నాయి.
విడతల వారీగా…

ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటన వివరాల ప్రకారం… 2026-27 ఆర్థిక సంవత్సరంలో 10 ఎస్సై పోస్టులు, 125 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక రెండో విడత కింద అంటే 2027-28లో 9 ఎస్సై ఖాళీలు, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో… పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించి… రాత పరీక్షలతో పాటు ఫిజికల్ టెస్టులను నిర్వహిస్తోంది. మెరిట్ ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఈ పోస్టుల భర్తీపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా అప్డేట్స్ తో పాటు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ల వివరాల కోసం https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.