AP Govt : త్వరలోనే 'గరుడ' స్కీమ్ కు శ్రీకారం - ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు...!
ఏపీ సర్కార్ త్వరలోనే గరుడ పేరుతో మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. మృతి చెందిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కీమ్ వివరాలను బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.
త్వరలో గరుడ పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పేద బ్రహ్మణ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు.

రూ. 10 వేల ఆర్థిక సాయం…
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాంప్రసాద్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గరుడ పథకం విధివిధానాలపై చర్చించారు. త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. గరుడు పథకం కింద నిరుపేదలైన బ్రాహ్మణులు మృతి చెందితే రూ.10 వేల ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థికసాయంతో పేద బ్రాహ్మణ కుటుంబాలకు కష్టసమయంలో ఉపశమనం లభిస్తుందన్నారు.
బ్రాహ్మణుల్లో పేదరిక నిర్మూలనకు 2014లోనే సీఎం చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో పథకాలను అమలు చేస్తూ, బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా కల్పనకు కృషి చేశారన్నారు. 2014-19లో భారతి, భారతీ విదేశీ విద్య, గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణమస్తు, కశ్యప, గరుడ వంటి పది పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల పథకాన్ని మొదట అమలు చేసిన ఘనత కూడా సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆదాయం లేని ఆలయాలకు ధూప దీప నైవేద్యం పథకాన్ని 2014-19లో సీఎం చంద్రబాబు అమలు చేశారని గుర్తుచేశారు. అప్పట్లో అర్చకులకు రూ.3 వేల గౌరవ వేతనంతోపాటు ధూప దీపాల కోసం మరో రూ.2 వేలు ఇచ్చేవారన్నారు.
మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అర్చకుల గౌరవ వేతనం రూ.7వేలకు, ధూప దీపాల కోసం రూ.3 వేలు పెంచుతూ ఇటీవల జీవో జారీ చేశారన్నారు. రూ.50 వేలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాల్లో దేవస్థానాల్లో పనిచేసే అర్చకులకు గౌరవ భృతిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. నిరుద్యోగ వేడపండితులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని సంభావన పేరుతో అందజేస్తున్నామన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

