ఏపీ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. డైరెక్ట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
మొత్తం 32 ఖాళీలు…

ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 20, బదిలీ ద్వారా 12 పోస్టులను రిక్రూట్ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 17 వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల 'లా' డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నిమిషానికి 180 పదాలు ఇంగ్లీష్ షార్ట్హ్యాండ్లో టైపింగ్ చేయాలి. లేదా 150 డబ్ల్యూపీఎం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషానికి 45 పదాల వేగంతో ఇంగ్లిష్ టైప్రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి.ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు.
అప్లికేషన్ విధానం…
ఈ పోస్టులకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తుతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ కాపీలు తప్పనిసరిగా ఉండాలి. పుట్టిన తేదీ ధ్రువపత్రం, డిగ్రీ సర్టిఫికెట్, షార్ట్ హ్యాండ్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటంది. https://aphc.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను నింపి… “రిజిస్ట్రార్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్ కోర్డ్ - 522239” చిరునామాకు పంపించాలి.
ఇక హైకోర్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్స్, ఎంట్రీ ఆపరేటర్స్,ఆఫీస్ సబార్డినెట్, టైపిస్ట్, ఎగ్జామినర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో అత్యధికంగా అసిస్టెంట్ ఖాళీలు 78 ఉన్నాయి.
{{/usCountry}}ఇక హైకోర్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్స్, ఎంట్రీ ఆపరేటర్స్,ఆఫీస్ సబార్డినెట్, టైపిస్ట్, ఎగ్జామినర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినెట్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో అత్యధికంగా అసిస్టెంట్ ఖాళీలు 78 ఉన్నాయి.
{{/usCountry}}ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ… మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://aphc.gov.in/index.php వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.