...
...
Next Story

AP ICET 2026 : ఏపీ ఐసెట్ అప్డేట్ - దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు, ఇవిగో కొత్త తేదీలు

AP ICET Registrations 2026 :ఏపీ ఐసెట్ - 2026 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఫైన్ లేకుండా మార్చి 23 తేదీ వరకు గడువు పొడిగించారు. మే 2వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరుగుతుంది.

Published on: Mar 22, 2026 08:36 AM IST
Advertisement

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ - 2026 దరఖాస్తుల గడువును పొడిగించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఏపీ ఐసెట్ దరఖాస్తులు 2026
ఏపీ ఐసెట్ దరఖాస్తులు 2026

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా… క్వాలిఫై అయిన అభ్యర్థులకు 2026- 27 విద్యా సంవత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక రూ. 1000 ఫైన్ తో మార్చి 24వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ. 2 వేల ఫైన్ తో అయితే మార్చి 29 వరకు, రూ. 4 వేల ఫైన్ తో ఏప్రిల్ 1 వరకు ఛాన్స్ ఉంది. రూ. 10 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 6వ తేదీన అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.

ఏపీ ఐసెట్ 2026 - ముఖ్యమైన తేదీలు:

  • ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏపీ ఐసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
  • మే 2వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
  • ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 25 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
  • ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
  • మే 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ప్రాథమిక కీలు విడుదలవుతాయి.
  • మే 7వ తేదీ వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
  • మే 16వ తేదీన ఏపీ ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe