AP PGCET 2026 Counseling : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఏపీ పీజీసెట్ 2026' (AP PGCET) మొదటి విడత ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్ గడువును అధికారులు పొడిగించారు.
రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు….

తాజా నిర్ణయం ప్రకారం…. అర్హులైన వాళ్లు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మొదట ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీతోనే రిజిస్ట్రేషన్ గడువు ముగియాల్సి ఉంది. అయితే, వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును పొడిగించారు.
అభ్యర్థుల సౌకర్యార్థం కౌన్సెలింగ్ ప్రక్రియలో మరికొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. ఈ నెల 11, 12 తేదీల్లో విద్యార్థులు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు వెబ్ ఐచ్ఛికాలను కూడా నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
సెప్టెంబర్ 16, 2026న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. సెప్టెంబర్ 21, 2026న కేటాయించిన సీట్ల వివరాలను ప్రకటిస్తారు. సీటు సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 22 వరకు సంబంధిత కాలేజీల్లో నివేదించాల్సి ఉంటుంది.సెప్టెంబర్ 21, 2026 నుండి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.
అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక పీజీసెట్ లో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొదటి విడత పూర్తి అయిన తర్వాత… మరో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది.
{{/usCountry}}అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక పీజీసెట్ లో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొదటి విడత పూర్తి అయిన తర్వాత… మరో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది.
{{/usCountry}}