AP AEE Recruitment : 630 ఏఈఈ ఉద్యోగాలు - ఈనెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం, హాల్ టికెట్ లింక్ ఇదిగో

AP Transco AEE Exam Schedule : ఏఈఈ 629 పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 23 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు.  పరీక్షల కోసం 94 కేంద్రాలు ఏర్పాటు చేశారు. apvidyutrecruitment.apcfss.in వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Published on: Aug 22, 2026, 12:26:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Transco AEE Exam Schedule : ఏపీలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సాయిసూర్య ప్రవీణ్‌చంద్ వెల్లడించారు.

విద్యుత్‌ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టులు
విద్యుత్‌ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టులు

మొత్తం 629 పోస్టుల కోసం దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ప్రతిభ (మెరిట్), రిజర్వేషన్ నిబంధనలు, వారి ప్రాధాన్యతల (ఆప్షన్లు) ప్రాతిపదికన మాత్రమే ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనుంది. తొలి సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మలి సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ పరిధిలో 81 పరీక్షా కేంద్రాలను, పొరుగు రాష్ట్రాల్లో 13 కేంద్రాలను కలిపి మొత్తం 94 కేంద్రాలను సిద్ధం చేశారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక చెల్లుబాటయ్యే అసలు గుర్తింపు కార్డును (ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు) తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు ఆదేశించారు.

పరీక్ష ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు, మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా నిరోధించడానికి విద్యుత్ సంస్థలు అపూర్వ భద్రతా చర్యలు చేపట్టాయి. బయోమెట్రిక్ ధ్రువీకరణ, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సమన్వయంతో ప్రతి పరీక్షా కేంద్రంలో మొబైల్ జామర్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలు లేదా సమాధానాల సమాచారం ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా ఈ జామర్లు పనిచేస్తాయి.

ప్రిలిమినరీ కీ ఎప్పుడంటే..?

చివరి పరీక్ష పూర్తయిన మూడు రోజుల్లోనే ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాతి ఏడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తారు. 2026 సెప్టెంబరు చివరి వారంలో ఫైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తుది మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తుదారులు… https://apvidyutrecruitment.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ వివరాలతో హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

సంస్థల వారీ ఖాళీలు :

  • ఏపీ ట్రాన్స్‌కో - 200 పోస్టులు
  • ఏపీ జెన్‌కో - 100 పోస్టులు
  • ఏపీఈపీడీసీఎల్‌ - 135 పోస్టులు
  • ఏపీఎస్‌పీడీసీఎల్‌ - 135 పోస్టులు
  • ఏపీసీపీడీసీఎల్‌ - 60 పోస్టులు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More