ఏపీ సీఆర్‌డీఏ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు

ఏపీ సీఆర్డీఏ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ ,ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు.. ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Dec 17, 2025, 13:35:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు.

ఏపీ సీఆర్‌డీఏలో ఖాళీలు
ఏపీ సీఆర్‌డీఏలో ఖాళీలు

ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

  • ఉద్యోగ ప్రకటన -ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ
  • ఉద్యోగాలు - 02
  • ఖాళీల వివరాలు - సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 1, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ (అప్లికేషన్‌ సపోర్ట్‌) -1
  • ఒక ఏడాది కాలానికి గానూ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు.
  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రారంభం - 17 డిసెంబర్ 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ - 30 డిసెంబర్ 2025
  • పని ప్రదేశం - ఏపీసీఆర్‌డీఏ, విజవాడ, అమరావతి.
  • అధికారిక వెబ్ సైట్ - https://crda.ap.gov.in/

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ PDF చూడొచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More