బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా? ఇకపై రూల్స్ మారాయ్.. నీట్ రాస్తేనే సీటు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ విద్యపై సంచలన నిర్ణయం తీసుకుంది. నర్సింగ్ ప్రవేశాలను NEET-UG పరీక్ష ఆధారంగా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

Published on: Feb 14, 2026 10:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సులకు నీట్-యూజీ ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి నర్సింగ్ ప్రోగ్రామ్‌లలో చేరాలనుకునే విద్యార్థులు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ) రాయాల్సి ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 నుండి ప్రారంభమయ్యే నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు నీట్-యూజీకి ఇకపై హాజరు కావాలి. పోటీ పరీక్షలో వారు సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఆరోగ్య శాఖ ఇటీవల ప్రతిపాదించిన విధంగా నీట్-యూజీ ద్వారా బీఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసించడానికి విద్యార్థులను ఎంపిక చేయాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు.

2025-26లో మొదటిసారిగా బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APNCET నిర్వహించారు. 16,000 సీట్లలో, 4,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంతకు ముందు బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లు ఇంటర్మీడియట్ మార్కులలో మెరిట్, ఏపీ ఎంసెట్‌లో ర్యాంక్ ఆధారంగా జరిగేవి. 2026–27 నుండి ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్, సీనియర్ ఆరోగ్య అధికారుల మధ్య జరిగిన చర్చల ప్రకారం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నీట్-యూజీని ఒక పద్ధతిగా సూచించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్.. రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ వెలుపలి నుండి విద్యార్థులను ఆకర్షించడంలో విఫలమయ్యాయని గుర్తించారు. నీట్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని, ఏకరూపతను నిర్ధారిస్తుందని, విద్యార్థులు తమ కెరీర్‌లను బాగా ప్లాన్ చేసుకోవడంలో సహాయపడుతుందని వైద్యారోగ్స శాఖ భావించింది. నీట్ ద్వారా నర్సింగ్ అడ్మిషన్లలో జాప్యాన్ని నివారిస్తుందని అధికారులు అనుకుంటున్నారు.

రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలు కూడా ఈ విధానానికి మద్దతు ఇచ్చాయి. నీట్ ఆధారిత అడ్మిషన్లు పారదర్శకత, విశ్వసనీయతను తెస్తాయని పేర్కొన్నారు. ఈ సంప్రదింపుల తర్వాత ఆరోగ్య మంత్రి ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి పంపారు. ఆయన ఆమోదం తెలపడంతో నర్సింగ్ అడ్మిషన్లకు నీట్ యూజీకి హాజరు అయ్యే విధానంలో వచ్చింది.