చంద్రబాబూ.. బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు.. ఆర్న ఐఏఎస్ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. సీఎం చంద్రబాబు సైతం ఆ బుజ్జి పాపాయి వీడియోను పోస్ట్ చేసి.. నవ్వకుండా ఉండలేం అంటూ కామెంట్ చేశారు.

Published on: Jun 27, 2026, 05:30:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సరికొత్త సంచలనాలకు వేదికవుతున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతతో రూపొందించిన ఒక చిన్నారి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘ఆర్న ఐఏఎస్’ పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ ఫన్నీ ఏఐ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరంగా స్పందించారు.

ఆర్న ఐఏఎస్ వీడియో వైరల్
ఆర్న ఐఏఎస్ వీడియో వైరల్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ నువ్ నాకు నచ్చావ్ అనే సూపర్ హిట్ సినిమాలో చెప్పిన ఎమోషనల్ డైలాగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకుని ఏఐ వీడియోను క్రియేట్ చేశారు. ఇందులో ‘ఆర్న’ అనే చిన్నారి విశాఖపట్నం (వైజాగ్) కలెక్టర్‌గా కుర్చీలో కూర్చుని ఉంటుంది.

'నేను కష్టపడి ఐఏఎస్ పాసై, వైజాగ్ కలెక్టర్ చైర్‌లో కూర్చుంటాను. ఒకరోజు సీఎం చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నప్పుడు.. అకస్మాత్తుగా కిటికీలోంచి బయటకు చూస్తే మా నాన్న కనిపిస్తారు. వెంటనే నేను.. చంద్రబాబూ.. బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు.' అని చెప్పేసి, టీవీ కట్టేస్తాను. నేరుగా బయటకు వచ్చేసి.. 'నన్ను క్షమించు నాన్నా.. నిన్ను వెయిట్ చేయించాను' అంటూ మా నాన్న కాళ్ల మీద పడతాను.."

ఈ విధంగా డైలాగ్ చెబుతున్నట్లుగా క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ సాధిస్తోంది.

ఈ వైరల్ వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా దీనిపై స్పందించారు. ఆ వీడియోను రీపోస్ట్ చేస్తూ.. "ఈ క్యూట్ వీడియో చూసి నవ్వకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం. నేను అధికారికంగా ఈ ఆర్న ఐఏఎస్‌కు నా మద్దతును ప్రకటిస్తున్నాను." అంటూ సరదాగా ట్వీట్ చేశారు. సీఎం స్వయంగా స్పందించడంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.

గతకొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన 96 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ.. తనకు చంద్రబాబును కలవాలని ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, ఆ గ్రామానికి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సత్యనారాయణను కలిసి ముచ్చటించారు.

చంద్రబాబు స్వయంగా సోషల్ మీడియాను నిశితంగా గమనిస్తున్నారనే సంకేతాలు వెళ్లడంతో పార్టీ శ్రేణులు, నాయకులు అలర్ట్ అయ్యారు. క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై చంద్రబాబు దృష్టి పెడుతుండటంతో, లీడర్లు మరింత క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, ప్రజలకు చేరువవడంలో చంద్రబాబు మార్క్ ఎప్పుడు కనిపిస్తుంటుంది. టీడీపీ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ బాగుంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More