రాజధాని నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తోన్న సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సీఎం ఆరా తీశారు.

ప్రస్తుతం రాజధానిలో వివిధ దశాల్లో రూ.57,821 కోట్ల విలవైన పనులు సాగుతోన్నాయని అధికారులు తెలిపారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి పనులు చేపట్టినట్లు సీఆర్డీఏ అధికారులు వివరించారు.
ప్రస్తుతం రాజధానిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనులు చేస్తున్నారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది...టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎంత మంది కార్మికులు పని చేయాలి..? ఎంత మంది పనిచేస్తున్నారు...? ఎంత మిషనరీ ఉపయోగించాలి..? అనే విషయాలపై సమగ్రంగా చర్చించారు.
టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలి - సీఎం చంద్రబాబు
వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు వివరించారు. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని... ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
“నిర్మాణ సంస్థలుగా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు...కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరే. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి... కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి... గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి” అని పలు విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}“నిర్మాణ సంస్థలుగా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు...కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరే. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి... కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి... గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి” అని పలు విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందేనని… ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు. మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని... ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలని సూచించారు.