ఆగస్టు 3వ తేదీ నుంచి సముద్రంలో వేటకు వెళ్లే క్రమంలో అదృశ్యమైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర మత్స్యశాఖ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ అన్వేషణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
అసలు ఏమి జరిగింది?

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఆగస్టు 3వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ జెట్టీ నుంచి పడవలో సముద్ర వేటకు వెళ్లారు. అయితే వారు బయలుదేరిన కొద్దిసేపటికే అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా వీరు ఆగస్టు 12వ తేదీ నాటికి ఒడ్డుకు తిరిగి రావలసి ఉంది. నిర్ణీత సమయానికి మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సమాచారం అందించగా, అధికారులు అన్వేషణ ప్రారంభించారు.
తీవ్రమైన గాలింపు చర్యలు
ఈ ఘటనపై అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ, అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను ఉపయోగించి మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావాలని స్పష్టం చేశారు. బాధితుల ఆచూకీ లభించే వరకు కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం నిరంతరం సమన్వయంతో అన్వేషణను కొనసాగించాలని ఆదేశించారు.
'ఆగస్టు 3న ఓడలరేవు జెట్టీ నుంచి వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి. వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని సాధ్యమైన చర్యలు తీసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అదృశ్యమైన ఆ బోటులో అత్యంత సమీపంలో ఉన్న నౌకలు, కేంద్రాలతో మాట్లాడేందుకు వెరీ హై ఫ్రీక్వెన్సీ(VHF) రేడియో సెట్ అమర్చబడి ఉంది. దీనితో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం, బయలుదేరిన రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
{{/usCountry}}అదృశ్యమైన ఆ బోటులో అత్యంత సమీపంలో ఉన్న నౌకలు, కేంద్రాలతో మాట్లాడేందుకు వెరీ హై ఫ్రీక్వెన్సీ(VHF) రేడియో సెట్ అమర్చబడి ఉంది. దీనితో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. అధికారులు అంచనా వేసిన దాని ప్రకారం, బయలుదేరిన రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం కోస్ట్ గార్డ్ కమాండెంట్ సముద్రంలో ఉన్న సమీప రోమింగ్, పెట్రోలింగ్ నౌకలను అప్రమత్తం చేశారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, అలాగే పారాదీప్ తీరాల నుంచి వేటకు వెళ్లే ఇతర మత్స్యకార పడవలను కూడా అధికారులు అప్రమత్తం చేసి, సమాచారం అందివ్వాలని కోరారు.
కుటుంబాలకు భరోసా
గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతో జిల్లా యంత్రాంగం నిరంతరం టచ్లో ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని సమయానుకూలంగా వారికి అందిస్తూ ధైర్యాన్ని నింపాలని అధికారులను కోరారు. ప్రభుత్వం ఈ కష్ట సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.