ఇంటికో పారిశ్రామిక వేత్త.. ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా కనిగిరి త్వరలో కనకపట్నం అవుతుందన్నారు.

Published on: Nov 11, 2025 1:11 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా రాష్ట్రం వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు. అంతేకాదు 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు సీఎం.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

మట్టిలో పుట్టిన మాణిక్యాలను సాన పెట్టే బాధ్యతను తాను తీసుకుంటానని, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. బ్రహ్మంగారు చెప్పినట్టు కనిగిరి త్వరలోనే కనకపట్నం అవుతుందన్నారు. రిలయన్స్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రవరీస్ ప్లాంట్ ఇక్కడ పెట్టిందన్నారు. అది ఎలా సాధ్యం అయిందో సీఎం చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోపాటుగా స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ది బిజినెస.. ఈ రెండింటితో సాధ్యమైందన్నారు.

'ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతాం. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులను తయారుచేయాలి. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులకు 33 వేల ఎకరాలు ఇచ్చారు. భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే అనేక పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఈ వారం పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొమ్నారు. కష్టపడి పని చేసే యువత మన రాష్ట్రంలో ఉందన్నారు.

News/Andhra Pradesh/ఇంటికో పారిశ్రామిక వేత్త.. ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు
News/Andhra Pradesh/ఇంటికో పారిశ్రామిక వేత్త.. ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు