...
...
Next Story

'సత్యసాయి సేవామార్గానికి ప్రతిరూపంగా నిలిచారు.. ప్రపంచానికి ప్రేమను పంచారు'

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవలను గుర్తు చేసుకున్నారు.

Published on: Nov 23, 2025, 13:19:38 IST
Advertisement

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఉపరాష్ట్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.

సేవా మార్గంలో నడిపించారు

శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు
శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు

సత్యసాయి సేవామార్గానికి ప్రతిరూపంగా నిలిచారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. ఆయన ప్రపంచం మెుత్తం ప్రేమను పంచారని గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారన్నారు. అనేక మందిని సేవా మార్గంలో నడిపించారని చెప్పారు. ఎంతోమందికి సత్యసాయి తాగునీరు అందించారని తెలిపారు. 'ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలు అందిస్తోంది. లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. సత్యసాయి అనేక వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యం అందించారు. తమిళనాడులో తాగునీటి సదుపాయం కల్పించారు.' అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు.

లక్ష్యం కోసం అవతరించారు

ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారని, దానికోసమే జీవించారన్నారు. మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారన్నారు. తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారన్నారు చంద్రబాబు. క్రమశిక్షమ, ప్రేమ, సేవాభావం గురించి చెప్పారన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా కొత్త అధ్యాయం ప్రారంభించారన్నారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీసత్యసాయి అని చంద్రబాబు అన్నారు.

'శ్రీసత్యసాయి తన మహిమలతో అన్ని మాతలు ఒక్కటేనని నిరూపించారు. అందరి సంక్షేమాన్ని కోరుకున్నారు. అనేక దేశాల అధినేతలువచ్చి ఆయనను దర్శించుకున్నారు. సాయి సిద్ధాంతం ప్రపంచం అంతా వ్యాపించింది. సత్యసాయిబాబా ట్రస్టు ద్వారా సేవలను ప్రపంచవ్యాప్తం చేశారు. 102 సత్యసాయిబాబా పాఠశాలల్లో 60 వేల మంది చదువుతున్నారు. ట్రస్టు ఆసుపత్రుల ద్వారా రోజుకు మూడు వేల మందికిపైగా రోగులకు చికిత్స అందుతోంది. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దాహార్తి తీర్చడానికి నీరు అందించారు.' అని చంద్రబాబు అన్నారు.

మనుషుల్లో దేవుడిగా

సత్యసాయి మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అని బోధించారని, దానిని అమలు చేశారన్నారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కారించారన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరేందుకు అవసరమైన ధైర్యాన్ని అందించారన్నారు. 140 దేశాల్లో సత్యసాయిబాబాకు భక్తులు ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe