మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అతలాకుతలం చేసింది. వాగులు, వంకల గుండా నీరు ప్రవహిస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.

తుపాను తర్వాత నీరు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. దీనితో చాలా రకాల రోగాలు వస్తాయి. అందుకే కేవలం వేడిచేసిన లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి. తుపాను ప్రభావం తగ్గింది కదా అని బయట తిరగకండి. అధికారిక సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.
మీరు పునరావాస కేంద్రంలో ఉంటే అధికారులు చెప్పేవరకు తిరిగి ఇంటికి వెళ్లవద్దు. చెప్పకుండా ఇంటికి వెళ్లి మళ్లీ ప్రమాదంలో పడకూడదు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులైన లేదా తెగిన తీగలు, పదునైన వస్తువుల దగ్గరికి వెళ్లవద్దు. ఈ సమయంలో ఇంటి గోడల గుండా కూడా కరెంట్ వెళ్లే అవకాశం ఉంది. చెక్ చేయించుకోవాలి.
దెబ్బతిన్న లేదా పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు. మీరు వెళ్లిన తర్వాత కూలిపోతే ప్రాణాలకే ప్రమాదం. విద్యుత్ పరికరాల వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తుపాన్ సమయంలో నీటికి తడిసిన లేదా దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను ఉపయోగించే ముందు ఎలక్ట్రీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. మీకు తెలియకుండా వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేయకండి. టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ హీటర్ లాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తుపాను తర్వాత ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలి.
పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే వెళ్లాలి. పాములు, ఇతర కీటకాలు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒరిగిన చెట్ల కిందికి అస్సలు వెళ్లకండి. ఎప్పుడు విరిగి మీద పడేది తెలియదు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న అస్సలు బయటకు రాకండి. ఇంకా తుపాను ప్రభావం తగ్గనందున విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోండి. బ్యాటరీతలో పనిచేసే టార్చిలైట్ను దగ్గర ఉంచుకోండి.
{{/usCountry}}పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే వెళ్లాలి. పాములు, ఇతర కీటకాలు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒరిగిన చెట్ల కిందికి అస్సలు వెళ్లకండి. ఎప్పుడు విరిగి మీద పడేది తెలియదు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న అస్సలు బయటకు రాకండి. ఇంకా తుపాను ప్రభావం తగ్గనందున విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోండి. బ్యాటరీతలో పనిచేసే టార్చిలైట్ను దగ్గర ఉంచుకోండి.
{{/usCountry}}