రూ. 3 లక్షల లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పల్నాడు డీఆర్వో

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Published on: Jan 24, 2026, 12:17:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటున్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన డీఆర్వో మురళీ
ఏసీబీకి చిక్కిన డీఆర్వో మురళీ

క్యాటరింగ్ బిల్లులను ఆమోదించినందుకు మురళి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రూ .30 లక్షల విలువైన క్యాటరింగ్ బిల్లులను క్లియర్ చేసినందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. అయితే సదరు కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు… పక్కా ప్లాన్ వేశారు. లంచం డబ్బులను తీసుకునే క్రమంలో రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు మహీందర్ మాట్లాడుతూ… 2023లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న వారికోసం 41,000 భోజన పార్శిళ్లను సాగరమాత క్యాటరింగ్ సర్వీసెస్ అందించింది. ఇందుకోసం బిల్లులు సుమారు రూ.37 లక్షలు. రూ.10 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వగా…. మిగిలిన రూ.26 లక్షలకు చెక్కు విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన చెక్కును ప్రాసెస్ చేసేందుకు పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి డిమాండ్ చేసి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారు.

“అతను లంచం తీసుకుంటుండగా మా బృందం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మా ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు రైడ్ చేయబడింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది” అని ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు మహీందర్ పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More