...
...
Next Story

Kurnool Road Accident : మంత్రాలయం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి

Kurnool road accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Published on: Apr 16, 2026, 09:18:28 IST
Advertisement

Kurnool road accident : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు.వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి
ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి

ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు… మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. సుమారు 16 మంది భక్తులతో కూడిన గూడ్స్ వాహనం మంత్రాలయం వైపు వెళ్తోంది. చిలకలడోన ప్రాంతానికి చేరుకోగానే వేగంగా వచ్చిన ట్యాంకర్ వీరి వాహనాన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి భక్తులు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయ్యింది.

"ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించాం" అని ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్. భార్గవి వివరించారు.

ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో మంత్రాలయం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తున్న వారు ఇలా రోడ్డు ప్రమాదానికి గురికావడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe