Kurnool : ప్రియుడి భార్యపై కక్ష - ‘వైరస్ ఇంజెక్షన్’ ఇచ్చిన మాజీ ప్రియురాలు, విచారణలో అసలు విషయాలు
కర్నూలు నగరంలో దారుణం వెలుగు చూసింది. తాను ప్రేమించిన వ్యక్తి దూరమైడన్న కారణంతో… అతని భార్యపై కక్ష కట్టింది ఓ ప్రియురాలు. రోడ్డు ప్రమాదం ప్లాన్ చేయటంతో పాటు వైరస్ ఇంజెక్షన్ తో దాడి చేసింది. ఈ ఘటనపై విచారణ జరగగా… కీలక విషయాలు బయటికి వచ్చాయి.
వారిద్దరూ గతంలో ప్రేమికులు..! కానీ కొన్ని కారణాలతో వారి వివాహనికి అడ్డంకులు ఎదురయ్యాయి. కట్ చేస్తే ప్రియుడికి మరో అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని దూరం పెడుతూ వచ్చాడు. కానీ ప్రియుడు దూరమైపోయాడన్న కారణంతో… ప్రియురాలు మాత్రం పెళ్లి చేసుకోలేదు. పైగా ప్రియుడి భార్యపై కక్ష పెంచుకుంది. ఆమెపై ప్రాణాంతక ఇంజెక్షన్తో దాడి చేసింది. నిర్ఘాంతపోయే ఈ ఘటన కర్నూల్ నగరంలో వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే..?
కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్ తెలిపిన వివరా ప్రకారం…. కర్నూల్ సిటీకి చెందిన ఓ వైద్యుడు… వసుంధర అనే స్థానిక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ కొనసాగింది. కానీ కొన్ని కారణాల రీత్య వీరి వివాహం జరగలేదు. కొన్నాళ్ల కిందట వైద్యుడికి…శ్రావణి అనే మరో వైద్యురాలితో వివాహమైంది. అప్పట్నుంచి వసుంధరకు దూరంగా ఉంటున్నాడు. దీంతో వసుంధర్ వైద్యుడి కుటుంబంపై కక్ష పెంచుకుంది. ప్రియుడి భార్యను చంపేందుకు కుట్ర చేసింది. ఇందుకోసం పెద్ద మాస్టర్ ప్లానే రచించింది.
ఈనెల 9న వైద్యుడి భార్య ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లింది. కేసీ కెనాల్ సమీపంలోకి రాగానే మరో స్కూటీ వచ్చి… శ్రావణి బైకును ఢీకొట్టింది. ఇంతలో ఆమె కిందపడిపోగా… ఆమెను వెంటనే ఇద్దరు మహిళలు వచ్చి ఆటోలోకి ఎక్కించారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రాథమిక చికిత్స పేరుతో వారితో తెచ్చుకున్న వైరస్ ఇంజెక్షన్ ఎక్కించారు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు.బాధితురాలు వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి.. తమదైనశైలిలో దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరా పుటేజి, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసు విచారణ చేపట్టగా కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఇదంతా కూడా వసుంధర చేసిన కుట్రగా గుర్తించారు. ఆమెకు సహకరించిన జ్యోతి అనే మహిళతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత… త్వరలోనే ఛార్జీషీట్ ఫైల్ చేస్తామని చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

