పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డుపై కారులో అతివేగంగా ప్రయాణిస్తూ కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Published on: Dec 05, 2025 2:29 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ఇంజీనిరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మేడగం రామిరెడ్డి, శివరాత్రి మహేశ్, మెరుపు శ్రీకాంత్, వంగవోలు వాసు, గొడవర్తి యశ్వంత్ సాయిని మృతులుగా గుర్తించారు. మరో ఇద్దరు, మద్దుకూరి కార్తీక్, చలపతిలకు తీవ్ర గాయాలయ్యాయి, వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు ఆయప్ప స్వామి మాల ధరించి ఉన్నారని… వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థుల మృతి బాధాకారం - మంత్రి లోకేశ్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారుయ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

ఈ ఘటనపై గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఐదుగురు విద్యార్థుల దుర్మరణం అత్యంత బాధాకరం. మృతుల్లో శ్రీకాంత్, వాసు, మహేష్, రామిరెడ్డి విజ్ఞాన్ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తుండగా, మరొకరు యస్వంత్ సాయి చలపతి కాలేజీలో చదువుతున్నారు. ఈ ఘోర ఘటన జరుగుటకు గల కారణాలపై సమగ్ర విచారణ చేయిస్తాం. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా అండగా నిలుస్తాం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి కార్తీక్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.