ఫ్లెమింగో ఫెస్టివల్ కు వెళ్తారా..? బోటింగ్ తో పాటు ఐల్యాండ్ విజిట్, ఉచిత బస్సులు కూడా...!
పులికాట్ సరస్సు తీరాన జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం వద్ద ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలలో డ్రోన్, సీీసి కెమెరాలతో నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు.
గత సంవత్సరం కన్నా మిన్నగా ఈ సంవత్సరం పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వివరించారు.

ఫ్లెమింగో ఫెస్టివల్ - ముఖ్యమైన అంశాలు
- ఆంధ్రప్రదేశ్ లోని అందమైన పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
- నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఆటకాని దిబ్బ, బివి పాలెం పాయింట్ లతో పాటు ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ తదితర ప్రదేశాలలో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- శ్రీ సిటీ లో జీవ వైవిధ్యం, పచ్చదనం పరిరక్షణ అంశాల పై బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ వారి ద్వారా రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.
- సూళ్లూరుపేట ముఖ్య వేదిక వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ సిటీ, శ్రీహరి కోట, చేనేత కళాకారులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
- బి వి పాలెం బోటింగ్ పాయింట్ వద్ద పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి సాహసాత్మక క్రీడలు ఉంటాయి.
- ఫ్లెమింగో ఫెస్టివల్ లో భాగంగా స్థానిక మత్స్యకారులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా 40 నిముషాలు బోటింగ్ కు రూ.30 మరియు ఇరుక్కుం ఐ ల్యాండ్ కు అప్ అండ్ డౌన్ కు రూ.100 ధరలు నిర్ణయించారు.
- బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించడంలో తగిన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా నిఘా ఉంచుతారు.
- విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కల్పించేలా రోజుకు 3 వేలు చొప్పున రెండు రోజులకు 6 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో కార్యక్రమంలోని అన్ని అంశాలను చూపించడం జరుగుతుంది.
- సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బి వి పాలెం వద్ద ఫ్రీ బస్ లు (ఉచిత బస్సులు) ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ… ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, సందర్శకుల తాకిడికి తగిన విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చామని చెప్పారు.ఫ్లెమింగో ఫెస్టివల్ కు వచ్చే సందర్శకులు పోలీస్ శాఖ వారు సూచించిన ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

