శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. జలాశయం గేట్లు తెరవడంతో గత రెండు రోజులుగా క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ పెరిగిందని వివరించారు.
భక్తుల రద్దీ కారణంగా…

శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ ఈ వారమంతా కొనసాగే అవకాశం ఉందని ఈవో తెలిపారు. ముందస్తుగా ఉచిత స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దీంతో జూలై 15 నుంచి 18వ తేదీ వరకు కల్పించే ఉచిత స్పర్శదర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పేర్కొన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని ఉద్దేశంతో ఉచిత స్పర్శదర్శనం నిలిపివేశామని వివరించారు. భక్తులందరూ మార్పును గమనించాలని కోరారు.
ఆన్లైన్ టోకెన్లు తప్పనిసరి:
భక్తుల రద్దీతో పాటు ఇతర కారణాల రీత్యా ఇటీవలనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత స్పర్శ దర్శనానికి ఆన్లైన్ ద్వారా టోకెన్లుజారీ చేస్తున్నారు. దీంతో స్పర్శ దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్ లైన్ ద్వారా టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండటంతో పాటు పారదర్శకంగా సేవలు అందించే దిశగా ఆన్లైన్ ద్వారా మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు…. www.srisailadevasthanam.org లేదా www.aptemples.ap.gov.in వెబ్సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, చిరునామా, ఆధార్ నంబరు నమోదు చేసి టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఒకరోజు ముందుగానే (సోమవారం నుంచి) వీటిని తీసుకోవచ్చు.
వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు. కానీ ప్రస్తుతం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో…కేవలం ఈ వారం మాత్రం స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తాజాగా ప్రకటన విడుదల చేశారు.
{{/usCountry}}వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు. కానీ ప్రస్తుతం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో…కేవలం ఈ వారం మాత్రం స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తాజాగా ప్రకటన విడుదల చేశారు.
{{/usCountry}}