సీపీఐ ఏపీ కొత్త కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య

సీపీఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉన్న రామకృష్ణ స్థానంలో… ఈశ్వరయ్య బాధ్యతలు చేపట్టనున్నారు. 

Published on: Oct 21, 2025, 16:49:37 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీపీఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త కార్యదర్శి నియామకం పూర్తి అయింది. ఈసారి రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది. ఇందుకోసం ముప్పాళ్ల నాగేశ్వర్ రావు పేరు కూడా పరిశీలనకు రాగా… చివరికి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈశ్వరయ్య
ఈశ్వరయ్య

కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య… సీపీఐ పార్టీ అనుబంధ సంఘమైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పని చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను రామకృష్ణ చూశారు. 2014 మే నుంచి బాధ్యతలు చేపట్టిన రామకృష్ణకు వరుసగా మూడు పర్యాయలుగా అవకాశం దక్కింది.

సీపీఐ పార్టీ నిబంధనల ప్రకారం… 3 పర్యాయాలు దాటితే కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే… ఈసారి గుజ్జుల ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది. కొత్త కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యకు… ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More