టీఎంసీ విశాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ మాత్రమే!
విశాఖలోని టీఎంసీలో టెక్నీషియన్ ఖాళీలకు రిక్రూట్మెంట్ మెుదలైంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుకు సెలక్ట్ చేస్తారు.
హొమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ విశాఖపట్నం(టీఎంసీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నీషియన్(ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. థర్డ్ పార్టీ కాంట్రాక్ ఉద్యోగాలు ఇవి అని గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. టెక్నీషియన్(ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్) 2 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు
ఈ పోస్టుకు 10+2 తర్వాత DMLT లేదా ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ లేదా బ్లడ్ బ్లాంక్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి, లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్లో రక్తం, /లేదా దాని భాగాల పరీక్షలలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. లేదంటే లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్లో రక్తం, /లేదా దాని భాగాల పరీక్షలో ఆరు నెలల అనుభవం కలిగి ఉండాలి. లేదా లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్లో రక్తం/లేదా దాని భాగాల పరీక్షలో ఆరు నెలల అనుభవం కలిగి ఉండాలి. హెమటాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో B.Sc. లైసెన్స్ పొందిన బ్లడ్ సెంటర్లో రక్తం /లేదా దాని భాగాల పరీక్షలలో ఆరు నెలల అనుభవం కలిగి ఉండాలి. అనుభవం అర్హత తర్వాత మాత్రమే పోస్టుకు పరిగణిస్తారు. వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు.
జీతం నెలకు రూ.23,220, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 2025 నవంబర్ 24 తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ముఖ్యమైన విషయాలు
ఈ పోస్టు పదవీకాలం చేరిన తేదీ నుండి ఆరు నెలల నిర్ణీత కాలం వరకు ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. పైన పేర్కొన్న పోస్టుల సంఖ్య కూడా విశాఖ టీఎంసీ అవసరాన్ని బట్టి పెరిగే/తగ్గే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీల సెట్ (విద్య, అనుభవం/రిలీవింగ్, గత 3 నెలల పేస్లిప్) తీసుకురావడం తప్పనిసరి. ఇది లేకుండా అభ్యర్థి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి వీలు లేదు. కమిటీకి సిఫార్సుల ఆధారంగా కావాలి అనుకున్న అభ్యర్థికి వయస్సు సడలింపు ఇస్తారు. రాత్రులు, ఆదివారాలు, సెలవు దినాలు సహా షిఫ్ట్ విధుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.
పైన పేర్కొన్న పోస్టులు పూర్తిగా తాత్కాలికం. ఆసక్తిగల అభ్యర్థులు విశాఖపట్నంలోని HRD డిపార్ట్మెంట్ మొదటి అంతస్తు హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో అప్డేట్ చేసిన రెజ్యూమ్, ఇటీవలి పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ ఫోటో కాపీ, ఆధార్ కార్డ్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, అన్ని సర్టిఫికెట్ల కాపీల సెట్తో హాజరు కావచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


