శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలు విరాళం - విలువ ఎంతో తెలుసా..!
తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.23 లక్షల విలువైన బంగారు చెవి ఆభరణాలను ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు. జత కర్ణపత్రములను టీటీడీ అధికారులకు అందజేశారు.
Published on: Jan 30, 2026 5:01 PM IST
By Maheshwaram Mahendra Chary, Tirumala
హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు.. శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలను విరాళంగా అందజేశాడు. రూ.23 లక్షల విలువైన 178 గ్రాముల బంగారంతో వీటిని తయారు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం…. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్కు చెందిన దీపక్ 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు. దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను టీటీడీ అధికారులకు గురువారం అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఇక ఫిబ్రవరి నెలలో పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలన టీటీడీ ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి….
- ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి ఉత్సవం.
- ఫిబ్రవరి 15న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
- శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం: ఫిబ్రవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
- శ్రీ బలరామకృష్ణుల ఆలయం: ఫిబ్రవరి 25న రోహిణి నక్షత్రం సందర్భంగా ఉత్సవర్లకు తిరుచ్చి ఉత్సవం.
- శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం : ఫిబ్రవరి 06న హస్తా నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
- శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం : ఫిబ్రవరి 07, 14, 21, 28 తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.
- అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
- ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.
- ఫిబ్రవరి 03న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
- ఫిబ్రవరి 11న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
- ఫిబ్రవరి 16న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.
- ఫిబ్రవరి 01, 08, 15, 22వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.

E-Paper












