...
...
Next Story

వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన..! తెలంగాణలో ఇలా....

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో శనివారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం జనవరి 12 వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది.

Published on: Jan 7, 2026, 10:08:36 IST
Advertisement

వాతావరణశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానికి అనుకుని ఉన్న తూర్పు భూమధ్య రేఖ హిందుమహాసముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని. ఇది నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

ఏపీకి వర్ష సూచన..!
ఏపీకి వర్ష సూచన..!

అల్పపీడనం ప్రభావంతో పక్క రాష్ట్రమైనా తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. అయితే శనివారం మాత్రం ఏపీలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.

అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఏపీలో ఈ 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురిసే అవకాశముందని అంచనా వేసింది. అయితే శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షాలు కురిస్తే ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత కొంత తగ్గే సూచనలున్నాన్నాయి.

తెలంగాణలో చలి తీవ్రత…

మరోవైపు తెలంగాణలో మాత్రం చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ వరకు మళ్లీ చలి గాలుల తీవ్రత ఉంటుంది. పొగమంచు పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పడిపోతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe