ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలును ప్రకటించింది.ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ ట్రైన్ సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
ట్రైన్ వివరాలు….

గుంతకల్లు - మార్కాపుర్ (ట్రైన్ నెబంర్ 57407) మధ్య రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు… సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి… రాత్రి 11.30 గంటలకు మార్కాపుర్ రోడ్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇది మధ్యలో నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.
అంతేకాకుండా మార్కాపుర్ రోడ్ నుంచి గుంతకల్లుకు (ట్రైన్ నెంబర్ 57408) మధ్య ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇది మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30కు గుంతకల్లుకు చేరుకోనుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగనుంది.
ఈ డైలీ ప్యాసింజర్ రైళ్లు…. మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.
ఈ ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టడం ద్వారా… నంద్యాల, గిద్దలూరు, కంబం ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ముఖ్యంగా విద్యార్థులకు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ నిర్ణయంపై స్థానికలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ కోసం నంద్యాల ఎంపీ శబరి… కేంద్రంతో పలుమార్లు చర్చించారు.