చెన్నైలో డ్రైవర్ మర్డర్ - తెరపైకి జనసేన నేత పేరు..! వెలుగులోకి సంచలన విషయాలు

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుతపై హత్య ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేసే రాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెన్నైలో మృతదేహాం లభించగా… పోలీసులు విచారణ చేపట్టింది. ఈ కేసులో 5 మందిని అరెస్ట్ చేయగా.. వినూత దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

Updated on: Jul 12, 2025 5:03 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీకాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు తమిళనాడులోని చెన్నైలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో అతని మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సెవెన్ వెల్స్ పోలీసులు… విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత దంపతులతో రాయుడు (మధ్యలో వ్యక్తి)
శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత దంపతులతో రాయుడు (మధ్యలో వ్యక్తి)

రాయుడుని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా గుర్తించగా…వీరిలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్‌ వినూత, ఆమె భర్త చంద్రబాబు కూడా ఉన్నట్లు తేలింది. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం.

రాయుడు ఎవరు…?

శ్రీకాళహస్తి జ‌నసేన ఇంచార్జ్ గా ఉన్న వినూత వద్ద రాయుడు డ్రైవర్ గా పని చేశాడు. అంతేకాకుండా నమ్మినబంటుగా ఉంటూ ఇతర పనులు కూడా చేసేవాడు. కొన్ని కారణాల రీత్యా రాయుడుని పనిలో నుంచి తీసేసినట్లు తెలిసింది. కట్ చేస్తే…. జూలై 8వ తేదీన చెన్నైలోని కూవం నది 4వ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు నివాసం వెనుక రాయుడి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. శ్రీకాళహస్తీకి కూడా వచ్చి పలు వివరాలను సేకరించారు. రాయుడిని హత్య చేసినట్లు నిర్ధారించారు. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయగా.. వీరిలో శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత, భర్త చంద్రబాబు సహా శివకుమార్, షైక్ తాసాన్, గోపిలు ఉన్నారు.ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులోకి ఉన్నట్లు సమాచారం.

పోలీసుల విచారణలో ఉన్న వినూత దంపతులు కొన్ని కీలక విషయాలు బయటపెట్టారని తెలుస్తోంది. జూన్ 21న రాయుడిని పనిలో నుంచి తీసేసినట్లు వెల్లడించారని సమాచారం. తమకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేస్తున్నాడనే కారణంతో తొలగించినట్లు చెప్పినట్లు తెలిసింది. అనేక అనుమానాలకు తావు ఇస్తున్న రాయుడు హత్య ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

పార్టీ నుంచి బహిష్కరణ

మరోవైపు హత్య ఆరోపణల రావటంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా ఉన్న కోట వినుతను బహిష్కరించింది. హత్య కేసులో ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

News/Andhra Pradesh/చెన్నైలో డ్రైవర్ మర్డర్ - తెరపైకి జనసేన నేత పేరు..! వెలుగులోకి సంచలన విషయాలు
News/Andhra Pradesh/చెన్నైలో డ్రైవర్ మర్డర్ - తెరపైకి జనసేన నేత పేరు..! వెలుగులోకి సంచలన విషయాలు