ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం (14-09-2026) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలు….

{{^htLoading}} {{/htLoading}}
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మిగతా జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
కీలక సూచనలు..
- వర్షం కురిసే సమయంలో, పిడుగులు పడేటప్పుడు ప్రజలు పొరపాటున కూడా చెట్ల కింద నిలబడకూడదు.
- రోడ్ల పక్కన ఉండే ప్రకటనల హోర్డింగ్స్, భారీ ఫ్లెక్సీల వద్ద రక్షణ పొందడానికి ఆగరాదు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు, పొలాల్లో పనిచేసే రైతులు మరియు కూలీలు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని, వాతావరణం ప్రశాంతంగా మారే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}