మెుంథా తుపాను పంట నష్టం నమోదు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఇటీవల మెుంథా తుపాను అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. తీవ్రంగా పంట నష్టం జరిగింది. అయితే పంట నష్టం నమోదును పొడిగిస్తున్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఏపీలో మెుంథా తుపాను తీవ్రంగా ప్రభావం చూపించింది. భారీగా పంట నష్టం జరిగింది. పంట నష్టం వివరాలు అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఈ పంట నష్టం గడువును మరో రెండు రోజులు పొడిగించినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతోపాటుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తామని అన్నారు. కొంతమంది రైతుల పంట నష్టం వివరాలు నమోదు కాలేదని తెలిసిందని అందుకే పొడిగిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో ఈ క్రాప్ నమోదు వందశాతం జరిగిందన్నారు. ఈ క్రాప్ నమోదు చేయలేదని జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎక్కడకు వచ్చినా... తాను వస్తానని, ఈ క్రాప్ నమోదు అయిందో లేదో చూపిస్తానని చెప్పారు.
మెుంథా తుపాను భారీగా పంట నష్టం చేసింది. రైతులకు నట్టేట ముంచి వెళ్లింది. సుమారు 1.98 లక్షల మంది రైతులకు చెందిన 3.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు సైతం పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలన్నా.. లేక పునరుద్ధరించాలన్నా.. 2 వేల 500 కోట్లపైన అవుతుందని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చెప్పింది.
ఇక తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టంలో సుమారు 70 శాతం వరకు వరి పంట ఉంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంట నెలకొరిగి నీటిలో నానడం వల్ల వరికంకులన్నీ కుళ్లిపోయాయి. వేలాది ఎకరాల్లో మెుక్కజొన్న, మినుము, పత్తి, కూరగాయలు, ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేతికి వచ్చే దశలో వరిపంటను తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. కాకినాడ జిల్లాలో 14 మండలాల్లోని 216 గ్రామాల్లో, కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల పంట భారీగా దెబ్బ తింది. కాకినాడ జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా, కోనసీమ జిల్లాలో 78 వేల ఎకార్లో నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ఇంకా పూర్తి కాకపోవడంతో మరో రెండు రోజులు గడువు పెంచుతున్నట్టుగా తాజాగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


