తిరుపతి 'స్విమ్స్'లో ఉద్యోగ ఖాళీలు - కేవలం ఇంటర్వ్యూనే...!
తిరుపతి స్విమ్స్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 8 ఫార్మాసిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్ ఖాళీలను రిక్రూట్ చేస్తారు.

ఈ పోస్టులకు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్-I ఖాళీలు 2 ఉండగా… న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ గ్రేడ్-II పోస్టులు 02 ఉన్నాయి. న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టు ఒకటి ఉంది. ఈ పోస్టులకు డిసెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
- మొత్తం ఖాళీలు - 05
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఎస్సీ/బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.
- ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ - 10 డిసెంబర్ 2025.
- ఇంటర్వ్యూ జరిగే ప్లేస్: పాత కమిటీ హాల్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి.
- ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. విద్యా అర్హత పత్రాలను వెంట తీసుకెళ్లాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://svimstpt.ap.nic.in/
- అప్లికేషన్ లింక్ - https://svimstpt.ap.nic.in/jobs_files/NM-Appl25.pdf
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

