శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కార్తీక మాసం శనివారం, ఏకాదశి కావటంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన మీద ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ప్రకటించారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. 'శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను.' అని చంద్రబాబు చెప్పారు.
కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటన మీద హోంమంత్రి అనిత మాట్లాడారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ఆలయానికి ప్రతీ వారం 1500 నుంచి 2 వేల మంది భక్తులు వస్తారని వెల్లడించారు. 'ఆలయం మెుదటి అంతస్తులో ఉంటుంది. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపడింది. ఈ కారణంగా ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో భక్తులు మృతి చెందడం బాధాకరం. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.' అని హోంమంత్రి అనిత వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ ఆలయంమైన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. సుమారు రూ.20 కోట్లతో నిర్మాణ చేశారు. మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. ఏకాదశి పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు ఎక్కువగా మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ ఆలయంమైన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. సుమారు రూ.20 కోట్లతో నిర్మాణ చేశారు. మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. ఏకాదశి పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు ఎక్కువగా మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
{{/usCountry}}