ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని చంద్రబాబు అన్నారు. తాను, పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే రకంగా ఆలోచిస్తామన్నారు.

'మా ప్రభుత్వంలో పింఛన్లకు ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఏపీలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అందులో 95 శాతం మంది మహిళలే. మా ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయి. అయినా ఒకేసారి 4 వేలకు పింఛన్లు పెంచాం. జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిషన్లతో పని చేయించాల్సి ఉంటుంది.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. గ్రామ సభలపై చంద్రబాబు మాట్లాడారు. సభలను మెుక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని అన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమది అని పేర్కొన్నారు. ఇంట్లో ఎందరు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. ఒకప్పుడు నెల పింఛను తీసుకోకపోతే వాటిని ఇచ్చేవారు కాదని, ఇప్పుడు రెండు, మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.
'ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలను కూడా ప్రోత్సహిస్తున్నాం. రాయితీలు ఇస్తాం. ప్రతీ జిల్లాలో పరిశ్రమలు రావాలి. కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలి. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తెస్తాం. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.' అని చంద్రబాబు అన్నారు.
అమరావతి పనులు వేగంగా నడుస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. 2028 నాటికి మెుదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. ప్రపంచంలోనే సుందర రాజధాని అమరావతి అవుతుందన్నారు. జనవరి వరకు రోడ్ల మీద ఉన్న గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
{{/usCountry}}అమరావతి పనులు వేగంగా నడుస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. 2028 నాటికి మెుదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. ప్రపంచంలోనే సుందర రాజధాని అమరావతి అవుతుందన్నారు. జనవరి వరకు రోడ్ల మీద ఉన్న గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
{{/usCountry}}ఏలూరు కలెక్టర్ పనితీరు మీద సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సిబ్బందికి కనీస అవగాహన లేకుండా గ్రామసభకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. గ్రామంలో ఎన్ని టాయిలెట్స్, ఎన్ని ఇళ్లు ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా గ్రామ సభకు ఎలా వస్తారన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచించాలన్నారు.