Kadapa Junction Renaming Clash : కడప నగరంలో ట్రాఫిక్ జంక్షన్ నామకరణం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అల్మాస్పేట సర్కిల్ వద్ద శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చివరకు రాళ్ల దాడికి…. పోలీసులపై దాడులకు దారితీసింది. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీస్ యంత్రాంగం నిందితులను ఏరివేసే పనిలో పడింది. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంది.
అసలేం జరిగింది…..?

స్థానిక అల్మాస్పేట జంక్షన్కు ఒక వర్గం టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేయగా, మరో వర్గం హనుమాన్ జంక్షన్గా నామకరణం చేయాలని పట్టుబట్టింది. ఈ రెండు వర్గాల మధ్య వాగ్వివాదం కాస్తా ముదిరి పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.
కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ.. "హింసకు పాల్పడిన కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాం. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు," అని స్పష్టం చేశారు. నగరంలో శాంతిని నెలకొల్పేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
12 ఏళ్ల నాటి వివాదం…
పోలీసుల సమాచారం ప్రకారం…. ఈ జంక్షన్ పేరుపై వివాదం నేటిది కాదు.. గత 12 ఏళ్లుగా అడపాదడపా ఈ అంశంపై ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో "నా మాటే చెల్లాలి" అనే ధోరణి సరైంది కాదని, అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని డీఐజీ హితవు పలికారు. రెండు వర్గాల వారితో కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లాలో మత సామరస్యాన్ని కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు.
కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ విశ్వనాథ్ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నితమైన చిన్న విషయాలను పెద్దవి చేసి కడప నగర ప్రశాంతతను దెబ్బతీయొద్దని వారు విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ విశ్వనాథ్ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నితమైన చిన్న విషయాలను పెద్దవి చేసి కడప నగర ప్రశాంతతను దెబ్బతీయొద్దని వారు విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ప్రస్తుతం అల్మాస్పేట పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం(144 సెక్షన్) ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నేత్రాలను (CC కెమెరాలు) పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.