మతం మార్పిడి విషయంలో ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని నొక్కి చెప్పింది. ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ కీలక తీర్పును మంగళవారం వెలువరించింది.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ… కీలక అంశాలను ప్రస్తావించింది. హిందూ, సిక్కు మతం లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎస్సీ సభ్యులకు అందుబాటులో ఉన్న రాజ్యాంగ రక్షణలను క్లెయిమ్ చేయలేరని పేర్కొంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా మతం మార్చుకుని మరొక మతాన్ని చురుకుగా ఆచరించినప్పుడు…. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధకత) చట్టం కింద రక్షణతో సహా ఎస్సీ గుర్తింపుతో ముడిపడి ఉన్న ఏ చట్టపరమైన అర్హతలు వర్తించవని స్పష్టం చేసింది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్, 1950 ప్రకారం…. ఎస్సీ హోదా నిర్దిష్ట మతాలకు పరిమితం చేస్తుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
ఏపీ హైకోర్టు తీర్పు - సమర్థించిన సుప్రీంకోర్టు
గుంటూరు జిల్లాలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్గా పని చేస్తున్నారు. అయితే ఆయన ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వీరిపై అట్రాసిటీ చట్టం కింద ఆనంద్… 2021లో కేసు పెట్టారు. ఈ కేసును సవాల్ చేస్తూ… వారంతా హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తుండటంతో క్రైస్తవుడవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు ఆయనకు వర్తించవని పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని గుర్తు చేస్తూ…. హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులే ఎస్సీలు అవుతారని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 30, 2025వ తేదీన ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్… సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
{{/usCountry}}ఏప్రిల్ 30, 2025వ తేదీన ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్… సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
{{/usCountry}}