తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపాయి. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో ఒకేసారి పలువురు(14 మంది వరకు) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.. బాధితులకు కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది.. దీనంతటకి కల్తీ పాలే కారణమన్న అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరిక….

ఈ ఏరియాల్లో గడిచిన మూడు నాలుగు రోజులుగా ఒక్కసారిగా డయేరియా, మూత్రపిండాల(కిడ్నీ) కేసులు అధికమయ్యాయి. వీరంతా కూడా ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా… మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురి కావటంతో పాల కల్తీ వ్వవహారం తెరపైకి వచ్చింది. చాలా మంది బాధితులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిలలాడుతున్నారు. వీరిలో కొందరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. శివరాత్రి రోజు తాగిన పాలు తేడాగా ఉన్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.
రంగంలోకి అధికారులు…
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో…. అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. అందరూ ఒకే చోట పాలు కొనడంతో.. కల్తీ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాలు తాగిన కాలనీలలో ఇంటింటా సర్వే చేపట్టారు. మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్, వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర బృందం ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు.
లాలాచెరువు, చౌడేశ్వరినగర్, స్వరూప నగర్ ప్రాంతంలో అకస్మాత్తుగా అనారోగ్యంపాలవ్వడం వెనుక కల్తీ పాలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన అధికారులు… పాల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపించారు.
ప్రస్తుతం కల్తీ పాలుపై దర్యాప్తు జరుగుతుండగా కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏరియాలో గణేశ్… వందకుపైగా ఇళ్లకు పాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్ కు పంపగా… ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.
{{/usCountry}}ప్రస్తుతం కల్తీ పాలుపై దర్యాప్తు జరుగుతుండగా కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఏరియాలో గణేశ్… వందకుపైగా ఇళ్లకు పాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను ల్యాబ్ కు పంపగా… ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.
{{/usCountry}}