ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తుల హాజరుకానున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ట్రైన్ నెం.12713/12714 విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ రైలుకు కొత్తగా హాల్టింగ్ ఇచ్చింది. 01.07.2026 నుండి 03.07.2026 వరకు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో తాత్కాలిక స్టాపేజీని ఏర్పాటు చేశారు. 12713 ట్రైన్ ఎర్రుపాలెం స్టేషన్కు 07.05కి వచ్చి.. 07.06కి బయల్దేరుతుంది. 12714 ట్రైన్ రాత్రి 9.22 గంటలకు చేరుకుని.. 09.23కి బయల్దేరి వెళ్తుంది.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో కొలువై ఉన్న ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారంగా, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది. నిత్యం వేలాది మంది భక్తులతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం.. పూర్వం జబాలి అనే మహర్షి ఇక్కడి గుట్టపై ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు, వేంకటేశ్వర స్వామి రూపంలో ఇక్కడ స్వయంభూవుగా వెలిశారని ప్రతీతి. జబాలి మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడం చేతనే ఈ ఊరికి మొదట జబాలిపురం అని పేరు వచ్చిందని.. కాలక్రమేణా అది జమలాపురంగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది.
గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఇష్టపడతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అలమేలు మంగమ్మ అమ్మవారు, పద్మావతి అమ్మవార్ల ఉప ఆలయాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రకృతి రమణీయత, ప్రశాంతమైన వాతావరణం భక్తులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.
ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో కేవలం ఖమ్మం జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల) నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
విజయవాడ, ఖమ్మం నగరాల నుండి ఎర్రుపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి నిరంతరం ఆర్టీసీ బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గం ద్వారా రావాలనుకునే వారు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో దిగి, అక్కడ నుండి ఆటోలు లేదా స్థానిక వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
{{/usCountry}}విజయవాడ, ఖమ్మం నగరాల నుండి ఎర్రుపాలెం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి నిరంతరం ఆర్టీసీ బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గం ద్వారా రావాలనుకునే వారు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో దిగి, అక్కడ నుండి ఆటోలు లేదా స్థానిక వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
{{/usCountry}}