నరసాపూర్‌ టూ సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు.. అనకాపల్లి నుంచి కూడా.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు !

రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. నరసాపూర్–సికింద్రాబాద్, అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. మరోవైపు పనుల కారణంగా కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Published on: Nov 11, 2025 3:34 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రద్దీ సమయంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. తాజాగా రద్దీని తగ్గించడానికి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే నరసాపూర్–సికింద్రాబాద్, అనకాపల్లి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రైలు నెం. 07455 నరసపూర్ - సికింద్రాబాద్ (ఒక సర్వీస్).. 12 నవంబర్ 2025న ఉంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టాప్‌లలో ఆగుతుంది.

అలాగే రైలు నం. 07179 అనకాపల్లి - సికింద్రాబాద్ (ఒక సర్వీస్) 15 నవంబర్ 2025న ఉంది. స్టాప్‌లు: తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి ఉన్నాయి.

పనుల కారణంగా రైళ్లు రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో తుని-హంసవరం-అన్నవరం-రావికంపాడు స్టేషన్‌ల మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్‌లాకింగ్ (ఎన్ఐ) పనుల కారణంగా, 20 నవంబర్ 2025న కింది రైళ్లు రద్దు అవుతాయి.

17267 కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం, 17268 విశాఖపట్నం - కాకినాడ పోర్ట్, 67285 రాజమండ్రి - విశాఖపట్నం, 67286 విశాఖపట్నం - రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.ప్రయాణీకులు గమనించి తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

News/Andhra Pradesh/నరసాపూర్‌ టూ సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు.. అనకాపల్లి నుంచి కూడా.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు !
News/Andhra Pradesh/నరసాపూర్‌ టూ సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు.. అనకాపల్లి నుంచి కూడా.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు !